అయోధ్య ఆస్తులు రూ.2,577 కోట్లు..

న్యూఢిల్లీ: ఆస్తుల్లో అయోధ్యరామిరెడ్డి టాప్, ఆ తర్వాతే మరో వైసీపీ సభ్యుడు నత్వానీ, నత్వానీవి రూ. 396 కోట్లు.
- కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల్లో ఆత్యంత ఎక్కువ ఆస్తులు కలిగిన తొలి ఇద్దరూ.. వైసీపీకి చెందినవారే.
- వైసీపీ నుంచి ఎన్నికైన కార్పొరేట్ ప్రముఖుడు పరిమల్ నత్వాని కంటే కూడా మరో ఎంపీ ఆళ్ల అయోధ్యరామి రెడ్డి ఆస్తులే ఎక్కువగా ఉన్నాయి.
- రూ. 2577 కోట్ల విలువైన ఆస్తులతో అయోధ్యరామిరెడ్డి ఆస్తుల్లో తొలిస్థానంలో ఉన్నారు.
- రెండో స్థానంలో రూ. 396 కోట్ల విలువైన ఆస్తులతో పరిమల్ నత్వానీ నిలిచారు.
- ఇక రూ. 379 కోట్ల విలువైన ఆస్తులతో బీజేపీ నుంచి ఎన్నికైన జ్యోతిరాధిత్య సింథియా మూడోస్థానంలో ఉన్నారు.
- మేరకు రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన 65 సభ్యులు ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లను అధ్యయనం చేసి ఏడీఆర్ సంస్థ నివేదిక రూపొందించింది.
- వైసీపీ నుంచి ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ ఆస్తుల విలువ రూ.4 కోట్లు ఉండగా… మరో సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆస్తుల విలువ కేవలం రూ. 32 లక్షలు.